మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జానకి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి తమను తాము రక్షించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జానకి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని యోగా కేంద్రం వద్ద జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకట్న నిషేధం, గృహహింస నిరోధక చట్టం, భరణము, బాల్యవివాహాలు, ఆస్తి హక్కు చట్టం తదితర వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తిరుపతయ్య, కృష్ణయ్య, ఆంజనేయులు, యోగా కేంద్రాన్ని నిర్వహకులు శోభ వతి, జయమ్మ , శివలీల, శ్రీలత, విజయలక్ష్మి మహిళలు పాల్గొన్నారు.